తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు శుభవార్త. త్వరలో రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డులో పేరున్న ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కేజీల చొప్పున ఉచితంగా ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చిన దాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారు.