తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నవారికి తీపి కబురు. ఇప్పటికే సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా.. మరో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డుదారులకు అమ్మహస్తం పేరుతో సరుకుల కిట్ ఇవ్వాలని భావిస్తోంది. తక్కువ ధరకే సబ్సిడీపై రేషన్ డీలర్ల ద్వారా సరుకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.