తెలంగాణలో కొత్త ఆహార భద్రత కార్డులు పొందిన వేలాది మంది లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు కలిపి ఒకేసారి రేషన్ పంపిణీ చేస్తుండగా.. కొత్తగా మంజూరైన కార్డులకు మాత్రం రేషన్ అందటం లేదు. కొత్త కార్డుదారులు సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనని రెవెన్యూ అధికారులు, డీలర్లు చెబుతున్నారు.