హైదరాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఇప్పటికే 55,000 కార్డులు మంజూరు చేశామని, మరో 1,30,000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ముషీరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు.