వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనుంది. ఏపీకి కేంద్రం 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రేషన్ కార్డుకు లీటర్ చొప్పున ఈ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి (మార్చి 23) గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏపీలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు.