తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ ద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,027 రేషన్ దుకాణాల పరిధిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 92,135 మంది అనర్హులను గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చూడటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు ఉన్నా.. గత ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారి పేర్లను కూడా అనర్హుల జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.