AP Ration Money Through DBT: ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ క్మురమంలోఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త ప్రకటించారు. రేషన్ వద్దనుకునే వారికి నగదు అందజేస్తామని, ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. నెలలో 15 రోజులు రేషన్ పంపిణీ ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందిస్తామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాపులు తెరిచి ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.