రాష్ట్రంలో సివిల్ సప్లయ్స్ శాఖ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. జూన్, జులై, ఆగస్టు మూడు నెలలకు కలిపి ఒకేసారి రేషన్ పంపిణీలో నయా రికార్డు సృష్టించింది. దాదాపు 95 శాతం రేషన్ పంపిణీ పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నెల వారీ రేషన్ పంపిణీలో 85 శాతానికి మించదని.. కానీ మూడు నెలల రేషన్ పంపిణీ మాత్రం 95 శాతం పూర్తైందని అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో వంద శాతం రేషన్ పంపిణీ జరిగిందన్నారు. అలానే సెప్టెంబర్ బరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఉండదని తెలిపారు. ఆ వివరాలు..