సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పీఎం కిసాన్ యాప్ పేరుతో నకిలీ లింక్లను వాట్సాప్లో పంపుతున్నారు. వాటిని నమ్మిన రైతులు తమ ఖాతాల నుంచి డబ్బు కోల్పోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో ఒక రైతు రూ.64,500 నష్టపోయాడు. ఇటువంటి వాటిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.