Krishna District Farmer Donates Land For School: కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామానికి చెందిన అన్నే పద్మనాభరావు, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తన 2 కోట్ల రూపాయల విలువైన 50 సెంట్ల స్థలాన్ని ఉచితంగా దానం చేశారు. ఈ స్థలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ భవనం నిర్మించనున్నారు. సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన విద్యార్థుల కష్టాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గొప్ప సేవను కలెక్టర్ బాలాజీ ప్రశంసించారు.