వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతుండగా.. రైతు భరోసా నిధులపై అనిశ్చితి నెలకొంది. గత యాసంగి సాయం అసంపూర్తిగా ఉండటంతో, ఖరీఫ్కు కలిపి ఇస్తారా? లేదా అనే సందేహాలున్నాయి. ఎకరంలోపు పంట సాగు చేస్తున్న సర్వే నంబర్ల సమస్యల వల్ల కొందరికి సాయం అందలేదు. సకాలంలో నిధులు అందకపోతే సాగు పనులు ఆలస్యమై దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే నేటి కేబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.