మధిరలో మంగళవారం జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం సహకరించకపోవడంతో సభను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతులకు పెట్టుబడి సాయం కింద.. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు మధిరలో రైతు ఆశీర్వాద సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. దీంతో హైదరాబాద్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు.