Tg Rythu Bharosa Satellite Imagery: యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల విడుదల అంశంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా అందనుంది. దీనికోసం శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులైన రైతులకు మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియ వల్ల నిధుల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.