ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుభరోసా కింద రైతులు, కౌలు రౌతులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బడ్జెట్లో వాస్తవాలను దాచిపెట్టారని విమర్శించారు.