ఒకప్పుడు రైతులు పంట పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టపోయేవారు.. దీని నివారణకు గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.10 వేలు ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తూ.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తోంది. అయితే.. వేసంగి సీజన్కు సంబంధించి నిధుల విడుదలలో ఆలస్యం జరిగింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే నిర్వహిస్తోంది. దాదాపు 10 శాతం భూముల్లో పంటలు సాగు చేయడం లేదని తేలడంతో.. ఈసారి రైతు భరోసా పొందే రైతుల సంఖ్య తగ్గనుంది. ఫిబ్రవరి చివరి వారంలో నిధులు విడుదల చేయనున్నారు.