రైతుభరోసా పథకం నిధుల పంపిణీ తెలంగాణలో విజయవంతంగా పూర్తయింది. మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను రూ.8,744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 15 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా మంగళవారం నిధులు విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో డబ్బులు అందని రైతులు ఏఈవో/ఈవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.