వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి.. 48 గంటల్లోనే రూ. 7,887 కోట్లను 7.5 లక్షల మంది రైతులకు చెల్లించామని ఆయన ప్రకటించారు. సన్న రకాలకు అదనంగా రూ. 314 కోట్ల బోనస్ చెల్లించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో సేకరణ నాలుగు రెట్లు (4X) అధికంగా ఉంది. ఈ వేగవంతమైన చెల్లింపుల ప్రక్రియ రైతులకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది.