రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూమికి సంబంధించి అన్ని సేవలను ఒకే దగ్గరికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రాష్ట్రంలోని 5 మండలాల్లో అమలు చేసేందుకు రెడీ అయింది. రెవెన్యూ, సర్వే, స్టాంప్లు, రిజిస్ట్రేషన్ విభాగాలు అన్నింటినీ కలిపి ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో పొందుపరిచారు.