రాష్ట్రంలోని రైతుల కోసం తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మంచి మనసు చాటుకున్నారు. యాచారంలో తనకున్న రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి దానం చేశారు. యాచారం రైతులు పంటల నిల్వ చేసుకోవడం కోసం, వ్యవసాయ పరికరాలు దాచుకోవడం కోసం ఈ స్థలం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భూమిని గిఫ్ట్ డీడ్ చేయించి.. దాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. ఆయన నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.