తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను నేటి (జనవరి 26) నుంచి సర్కార్ ప్రారంభించింది. ప్రారంభమైతే అయ్యింది కానీ.. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమవుతాయన్న అనుమానంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈరోజు (జనవరి 26న) అర్ధరాత్రి నుంచి మొదలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.