తెలంగాణలో 2025- 26 ఖరీఫ్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి.. 14.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రూ.18,444 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సన్న బియ్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.