Minister Orders Issued Pending Bills To Farmers: జోగులాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీడ్స్ కంపెనీలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దాదాపు రూ.700 కోట్ల బకాయిలున్నాయని, వచ్చే నెలలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్ణయం ద్వారా రైతుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.