తెలంగాణలో వ్యవసాయ రంగంలో కొత్త శకం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు గ్రిడ్కు అనుసంధానించబడింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు ప్రాజెక్టు. ఈ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని.. విద్యుత్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.