Cyber Security Officers Alert Farmers: కూర్చున్న చోటు నుంచి కదలకుండా డబ్బులు సంపాదించాలనుకునే సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు రైతులను టార్గెట్ చేసుకుని.. వారి భూములపై కన్నేశారు. భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటూ నకిలీ లింకులు పంపి, వారి భూములను తమ పేరుతో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తాజాగా దీని గురించి తెలంగాణ సైబర్ భద్రతా అధికారులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నకిలీ లింకుల మీద క్లిక్ చేయవద్దని సూచించారు. కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు చెక్ చేసుకోవాలని తెలిపారు.