Rachapalli Farmers Pattadhar Passbooks: అనకాపల్లి జిల్లా రాచపల్లి రైతుల చిరకాల సమస్యకు తెరపడింది! ఏపీఐఐసీ రికార్డుల్లో తప్పుగా నమోదైన 186 ఎకరాల జిరాయితీ భూములను స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో రైతుల పేరు మీదకు మార్చారు. దీంతో 246 మంది రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు అందనున్నాయి. సీఎం ఆదేశాలతో అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే వీరికి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందజేయనున్నారు. మొత్తానికి రైతుల సమస్య తీరింది.