Andhra Pradesh Farmers Gokulam Sheds 90% Subsidy: రైతుల ఆర్థికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'గోకులం షెడ్ల' పథకాన్ని భారీగా విస్తరిస్తోంది. పశుపోషకులకు 90%, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70% వరకు రాయితీతో షెడ్లు మంజూరు చేస్తోంది. రూ.1.15 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ఒక్కో షెడ్డుకు కేటాయింపులు జరుగుతున్నాయి. అర్హులైన రైతులు గోకులం షెడ్ల కోసం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, జాబ్ కార్డులతో ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.