తెలంగాణ రైతుల సౌకర్యార్థం కేంద్రం పత్తి కొనుగోళ్లకు 122 కేంద్రాలు ఏర్పాటు చేసింది. డిజిటల్ విధానాలతో పారదర్శకత, సకాలంలో చెల్లింపులు అందిస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారం 92% సామర్థ్యంతో నడుస్తూ.. పొరుగు రాష్ట్రాల అవసరాలు తీరుస్తోంది. 35.31 లక్షల టన్నుల ఎరువుల ఉత్పత్తి, 33.05 లక్షల టన్నుల విక్రయం జరిగింది.