తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలు రికార్డు ధరకు పలికినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.21,546గా నమోదైందని చెప్పారు. ధరల పెరుగుదలతో రైతులకు భారీగా ఆదాయం వచ్చిందన్నారు. మెుత్తం 15,024 మంది రైతులకు రూ.2 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు.