తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయగా.. మరో పథకం కింద అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. త్వరలోనే పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అన్నారు.