రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. యూరియా కష్టాలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జిల్లా యూనిట్గా యూరియా సరఫరా జరుగుతుండగా.. ఇక నుంచి మండల యూనిట్గా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యూరియా యాప్లో టెక్నికల్ సమస్యలు ఎదురవుతుండగా.. వాటిని కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.