తెలంగాణలో తెల్ల కాగితాలపై జరిగిన భూ లావాదేవీల (సాదాబైనామాలు) వల్ల రైతులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించనుంది. 2020లో అందిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొనుగోలుదారు అఫిడవిట్ సమర్పిస్తే.. ఆర్డీవో పరిశీలన అనంతరం భూ భారతిలో యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఈ మేరకు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రెవెన్యూ శాఖలో పనిభారం ఆధారంగా ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సంఖ్యను 636 నుంచి 332కు కుదించిన ప్రభుత్వం.. వారి పదవీకాలాన్ని 2027 వరకు పొడిగించింది.