రైతులు తమ పంట పొలాలను జాగ్రత్తగా చూసుకొని.. ఎండకు, వానకు అవి దెబ్బతినకుండా.. పంట చేతికి వచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. పంటి చేతికి అందాక మార్కెట్లో మంచి రేటు వచ్చిందంటే.. చేసిన కష్టం అంతా మర్చిపోతాడు. అయితే ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయం చేసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎరువుల ద్వారా పండించే పంటలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ ఎరువులు కొనే సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే దానిపై బీమా వర్తిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.