Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త! సన్న ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ను ప్రభుత్వం ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.