తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేసింది. భూ భారతి కార్యక్రమంలో భాగంగా.. రెవెన్యూ చట్టం 2024లో వీటికి చట్టబద్ధత కల్పించారు. గతంలో ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల వల్ల ఆగిపోయిన ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న రైతులకు తమ భూమిపై హక్కులు లభించనున్నాయి.