జరీబు భూముల సమస్యను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్.. నెల రోజుల్లో జరీబు భూముల సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.