తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్ మీద రూ.500 బోనస్ ప్రకటించింది. అయితే ఈ సారి వానకాలం పంటకు సంబంధించి ఈ బోనస్ డబ్బులు రైతులకు అందుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే, మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 78 మంది రైతులకు బోనస్ డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలో జమ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే దీనిపై స్పష్టత లేకపోవడంతో.. చాలా మంది రైతులు ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. ఆ వివరాలు..