26 High Tech Godowns in Telangana: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు..