రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఒక్కో ఎకరాకు రూ.10 వేలు, డబ్బులు విడుదల..

1 year ago 28
వికారాబాద్ జిల్లాలోని 823 మంది రైతులకు రూ.68 లక్షలకు పైగా పంట నష్టపరిహారం మంజూరైంది. గత యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన 688 ఎకరాలకు ఎకరానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వరి, మక్క, పత్తి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు ఈ సాయంతో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు ముందస్తు ప్రణాళిక, స్వల్పకాలిక పంటలు, వర్షపాతం గమనించి విత్తనాలు వేయాలని సూచించారు. రైతు భరోసా వంటి ఇతర సహాయాలనూ ఆశిస్తున్నారు.
Read Entire Article