రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasareddy) పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పది రోజుల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని.. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ (Bonus) ఇస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం రైతులను రాజును చేయాలని సంకల్పించిందని తెలిపారు. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, ఆ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుదాఘాతంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును అందించారు.