Mid Day Meals for Farmers at Rs 10: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అన్నదాతల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ ముందుకు వచ్చింది. రూ.10కే కడుపునిండా భోజనం అందించే కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రారంభించారు. రైతులకు మధ్యాహ్న భోజనం కోసం అయ్యే ఖర్చులో రూ.10 మాత్రమే వసూలు చేసి, మిగతా మొత్తాన్ని మార్కెటింగ్ శాఖ, ఇస్కాన్ భరిస్తాయి. ఇది రైతులకు ఎంతో మేలు చేకూర్చే గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.