తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. జనవరి 26వ తేదీన రైతుభరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎకరాల వారీగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా.. మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల అంకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ క్రమంలోనే బ్యాంకర్లకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు.