రైలు జనరల్ బోగీలో సీటు కోసం రివాల్వర్‌తో బెదిరింపులు.. సీఆర్పీఎఫ్ రిటైర్డ్ పోలీస్ హల్ చల్!

5 months ago 24
రైలు జనరల్ బోగీలో సీటు కోసం రివాల్వర్‌తో ప్రయాణికులను బెదిరించిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పరిధిలో చోటుచేసుకుంది. మనోహర్ అనే సీఆర్పీఎఫ్ రిటైర్డ్ పోలీస్.. యలహంక - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ.. జనరల్ బోగీలో సీటు కోసం ప్రయాణికులను తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో బెదిరించినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించగా.. గుంతకల్లు ఆర్పీఎఫ్ సిబ్బంది మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మొదటి తప్పుగా హెచ్చరించి పంపించారు.
Read Entire Article