Ongole Stone Attack On Vande Bharat: ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో రైలులోని అద్దాలను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.