రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలికి పురిటి నొప్పులు రాగా.. తోటి మహిళా ప్రయాణికులు కలిసి ఆమెకు పురుడు పోసిన ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చోటుచేసుకుంది. ఓ గర్భిణి, శనివారం తన కుటుంబంతో కలిసి చెన్నై నుంచి ధన్బాద్కు బొకారో ఎక్స్ప్రెస్లో వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు రాగా.. బోగీలోని తోటి మహిళలు, మహిళా టీటీ, రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు ప్రసవం చేశారు. ఇందుకోసం ఎలమంచిలి రైల్వేస్టేషన్లో రైలును 40 నిమిషాలు నిలిపివేశారు. బోగీలోని మగవారిని కిందకు దింపి రైల్వే సిబ్బంది వారికి సహకరించారు.