విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రం ఏపీలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా.. ఇదిగో జోన్.. అదిగో జోన్ అని అంటున్నారు తప్పా.. వాస్తవరూపం దాల్చలేదు. ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించకపోవడం వల్లే జాప్యం జరుగుతోందని గతంలో కేంద్ర సర్కారు పలుసార్లు తప్పించుకుంది. జోన్ ఏర్పాటు ప్రక్రియ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. .