తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిరంతర వర్షాల కారణంగా రైల్వే మార్గం దెబ్బతిని రైలు సర్వీసులు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాలు వరద నీటితో మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అధికారులు అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లే వారు మానుకోవాలని కూడా హెచ్చరించారు.