తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. కడప మీదుగా తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును ఆగష్టు నెలలో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ఆగష్టు 3 నుండి 24 వరకు అందుబాటులో ఉంటుంది. పూర్తిగా ఏసీ బోగీలతో నడిచే ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.