రెండు తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు. పలు స్టేషన్లలో స్టాపేజీని ఆరు నెలల పాటు పొడగించారు. ఫిబ్రవరి 6 నుంచి 6 నెలల పాటు స్టాపేజీ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు స్టాపేజీ కల్పించిన ట్రైన్ల వివరాలను వెల్లడించారు.