తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే.. స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళలను చేపట్టారు. ఆ స్టేషన్ నుంచి విద్యార్థులు, పనికి వెళ్లే వారికి రైల్వే ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. ప్రయాణికులు లేని కారణంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఉత్వర్వులను వెనక్కి తీసుకోవాలని ఇటీవల అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై రైల్వే అధికారులు స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు.