రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు తీసుకుంటోంది. త్వరలోనే లెవెల్ ఫోర్ ట్రామా కేర్ అందుబాటులోకి తీసుకురానుంది. గోల్డెన్ అవర్లో బాధితులకు చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఆస్పత్రి వరకు పక్కా నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు.. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 911 బ్లాక్స్పాట్స్ను అధికారులు సర్వే చేసి మరీ గుర్తించారు. అక్కడి నుంచి దగ్గర్లోనే ఈ ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.